సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 74వ,వర్థంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలోని గాంధీ పార్కు సెంటర్ నందలి మహాత్మా గాంధీ విగ్రహానికి పలువురు ఆర్యవైశ్య సంఘం నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు మహాత్మాగాంధీ గొప్పతనాన్ని స్మరించుకుంటూ మహాత్మా గాంధీ చూపిన మార్గంలో ప్రజలందరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అనంతరం పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘము అధ్యక్షుడు ఓరుగంటి నర్సింహారావు,కార్యదర్శి పోలిశెట్టి లక్ష్మీ నర్సింహారావు, కోశాధికారి తొడుపునూరి శేఖర్,బచ్చు రామారావు,4వ,వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు, వంగవేటి హనుమంతరావు,ఓరుగంటి మట్టయ్య,మట్టపల్లి వెంకటనారాయణ, విశ్రాంత ఉపాధ్యాయుడు ఓరుగంటి నర్సయ్య,కామిశెట్టి నందయ్య,గుండా రమేష్,డాక్టర్ నోముల వెంకటేశ్వర్లు, కొత్త శ్రీనివాసరావు,సిద్దంశెట్టి శ్రీనివాస్, నాగేశ్వరరావు,పేరూరి అశోక్ కుమార్,చిట్టిపోలు నాగేశ్వరరావు, కొండలు,సోమశేఖర్,మహిళా సంఘం నాయకులు వంకాయల పద్మ,తమ్మన సుజాత తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్