తెలంగాణ ప్రదేశ్ పిసిసి అధ్యక్షులు నల్లగొండ జిల్లా ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమారెడ్డి పిలుపు మేరకు హుజూర్ నగర్ సాయిబాబా గుడి పరిధిలోని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వార్డులలో నిరుపేదలకు, దివ్యాంగులకు అయిదు క్వింటాళ్ల బియ్యం, రెండు క్వింటాళ్ల కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
కరోనా వైరస్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి సుతారి జానకి వేణుగోపాల్, పాశం రామరాజు వార్డులలో ఇంటింటికి ట్రాక్టర్ మీద వెళ్లి బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వార్డు ముఖ్యులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశముఖ్, ఐ ఎన్ టి యు సి జిల్లా నాయకులు ఎరగాని నాగన్న గౌడ్, వంకాయల నరసింహారావు దంపతులు, కుక్కడపు కోటేశ్వర్ రావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకుల ప్రజా సంఘాల నాయకులు ఐఎన్టియుసి మండల అధ్యక్షులు మేళ్లచెర్వు ముక్కంటి, డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబూరావు, కొల్లూరి రాము ఇంటి అచ్చమ్మ బెల్లంకొండ గురవయ్య, పోతన బోయిన రామ్మూర్తి, పాశం వెంకటనారాయణ నరసయ్య, విజయ్, శ్రీకాంత్ సైదులు, కృష్ణ, ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు.