కరోనా వైరస్ బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధి విరాళాం అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ అన్నారు. కరోనా బాధితులను ఆదుకోవడానికి రాష్ర్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధికి నిర్మల్ పట్టణానికి చెందిన 2వ వార్డు కౌన్సిలర్ సాదం స్వప్న అరవింద్ అధ్వర్యంలో పొలిశెట్టి విజయ్ కుమార్ తన వంతు సహాయంగా రు.10000/- ల చెక్కును గురువారం రోజున జిల్లా కలెక్టర్ కు అందజేశారు. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంఘీభావంగా విరాళం అందించినందుకు ఈ సందర్బంగా కలెక్టర్ వారికి ధన్యవాదాలు తెలిపారు.
previous post