Slider మహబూబ్ నగర్

అధ్యాపకులకు నిత్యావసర సరుకుల పంపిణీ

#YRM Junior College

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వై ఆర్ ఎం, న్యూ ఎరా కళాశాలలో పనిచేస్తున్న 36 మంది అధ్యాపకులకు ,సిబ్బందికి సోమవారం వై ఆర్ ఎమ్ కళాశాల ప్రిన్సిపాల్ సాంబయ్య గౌడ్ కరస్పాండెంట్ శ్రీనివాస్ శర్మ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న సందర్భంగా  గత మూడు మాసాల నుంచి  ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న లెక్చరర్స్ ను  దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం , నిత్యవసర వస్తువులను పంపిణీ చేశామని కళాశాల ప్రిన్సిపాల్ సాంబయ్య గౌడ్ తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో ని అన్ని వర్గాలకు సహాకారం అందించడం జరిగిందని, అదేవిధంగా భావిభారత పౌరులను తయారు చేసే ప్రైవేట్ అధ్యాపకులను కూడా ప్రభుత్వం తగిన సహకారం అందించి అధ్యాపకులను అదుకోవాలని ప్రభుత్వాని కోరారు.

ఈకార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు  శంకరయ్య ,సత్యం ,దేవరాజు ,ప్రభాకర్ ,యాదగిరి ,శ్రీనివాస్ రావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం

Sub Editor

జెర సోచాయించు తమ్మీ….

Satyam NEWS

మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!