సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వేపలసింగారం గ్రామంలో సోమవారం సర్పంచ్ శిరీష కొండారెడ్డి గ్రామలో తిరుగుతూ ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సియం కేసీఆర్ ఆదేశాల తో నియోజకవర్గ యంయల్ఏ శానంపూడి సైదిరెడ్డి సూచనల మేరకు హరిత హారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం మొక్కలతో పచ్చగా ఉండాలని, ప్రతి ఒక్కరు మొక్కలను నాటి, వాటిని శ్రద్ధతో పెంచి పర్యావరణాన్ని కాపాడాలని, ఈ మొక్కల పెంపకం ప్రతి పౌరుని భాద్యతగా గుర్తెరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వరలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ శ్యామ్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.