ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిని తరిమికొట్టాలి అనే దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కల్వకుర్తి స్వచ్ఛంద సంస్థలు కోరాయి.
కల్వకుర్తి కి చెందిన హనుమాన్ నగర్,జె.పి నగర్,భగతసింగ్ తండాలో నివసిస్తున్న పేద గర్భిణి స్త్రీలకు వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో కల్వకుర్తి స్వచ్ఛంద సంస్థలు స్వామివివేకానంద సేవా బృందం,యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పండ్లు,పప్పు,నూనె,మిల్ మేకర్,కోడిగుడ్లు యువకులు ఇంటింటికి వెళ్లి సమాచారం కనుక్కొని వారికి అందజేశారు.
యువకులు వినూత్నమైన రీతిలో పేద గర్భిణి మహిళలకు సాయం చెయ్యడం పై పలువురు వారిని అభినందించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సందీప్,శివ కుమార్,పవన్,లక్ష్మీకాంత్,అంజి,కిషోర్,ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు