అర్హత కలిగిన రేషన్ కార్డు దారులకు వెయ్యి రూపాయల పంపిణీ కార్యక్రమం విజయవంతం గా జరిగిందని మంత్రి ఆదిములపు సురేష్ తెలిపారు. నేడు ఆయన కడప జిల్లా కడప పట్టణంలో జరిగిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. లాక్ డౌన్ పకడ్బందీగా అమలు కు పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చామని ఆయన తెలిపారు.
కరోనా పై నియోజకవర్గ స్థాయిలోను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కరోనా నివారణకు అన్ని రాజకీయ పార్టీలు వారి సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు. వైఎస్సార్ కడప జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్నా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన తెలిపారు.
వ్యాయామ ఉపాధ్యాయుల సేవలను కూడా లాక్ డౌన్ అమలుకు ఉపయోగించుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రతి విద్యార్థి ఇంటి వద్దకు భోజనం లో ఇచే గుడ్లు, చెక్కి లని వాలంటీర్ల ద్వారా పంపిస్తామని ఆయన వెల్లడించారు. పదవ తరగతి పరీక్షలు త్వరలో నిర్ణయించి షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.