పెద్దపల్లి మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి 36 మంది టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని, పెద్దపల్లినీ జిల్లా కేంద్రంగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పట్టణ అభివృద్ధికి 50 కోట్లు మంజూరు చేశారని ఆ పనులు చివరిదశకు చేరాయన్నారు. రాబోయే రోజుల్లో పెద్దపెళ్లి అభివృద్ధి కోసం నిధుల వరద పారుతుందని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ అన్న కేటీఆర్ దగ్గర నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తారు అని పేర్కొన్నారు.