కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారిని ఎవరికి తోచిన విధంగా వారు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ ద్వారా ఆదుకోవాలని కేశినేని శ్వేత సూచించారు.
గాంధీజీ కళాశాల ఆవరణలో రైతుబజార్లలోని వినియోగదారులకు, వర్తకులకు నేడు ఆమె 1000 మాస్కులు పంపిణీ చేశారు. 46వ డివిజన్ లో గుర్రం కొండ ఆధ్వర్యంలో నిర్వహించిన కూరగాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.