29.7 C
Hyderabad
April 29, 2024 07: 27 AM
Slider హైదరాబాద్

సీఎం స‌హాయ‌నిధి రూ.2.50 ల‌క్ష‌ల చెక్కు అంద‌జేత‌

sab-2

మహేశ్వరం నియోజకవర్గం నాదర్ గుల్ గ్రామానికి చెందిన బత్తుల సురేష్ కుమార్తె లోహిత అరుదైన‌ హార్మోన్స్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నవిష‌యాన్ని స్థానిక నాయ‌కుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే, మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి చొర‌వ‌తో సీఎం స‌హాయ‌నిధికి ప‌రిస్థితిని వివ‌రిస్తూ వైద్య‌స‌హాయానికి ఆర్జీ పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం స‌హాయ‌నిధి నుంచి మంజూరైన రూ.2.50 ల‌క్ష‌ల‌ను సబితా ఇంద్రారెడ్డి బాధిత కుటుంబానికి నేడు అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం స‌హాయ‌నిధి నిరుపేద‌ల పాలిట ప్రాణ‌దాత‌గా నిలుస్తోంద‌ని అన్నారు. నిరుపేద‌ల‌కు కార్పొరేట‌ర్ త‌ర‌హా వైద్యం అందించాల‌న్న ఉద్దేశ్యంతోనే అంద‌రికీ నాణ్య‌మైన వైద్య‌సేవ‌ల‌ను అందించాల‌ని సీఎం స‌హాయ‌నిధిని ప్రారంభించార‌న్నారు. ఇందులో భాగంగాగానే ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలోని అనేక‌మంది నిరుపేద‌ల ప్రాణాలు నిలిచాయ‌న్నారు. ఆయా ల‌బ్ధిదారులైన కుటుంబాల‌ను సీఎం కేసీఆర్ ప‌థ‌కాన్నిఎన్న‌టికీ మ‌ర్చిపోలేర‌న్నారు. అర్హులైన ల‌బ్ధిదారులు సీఎం స‌హాయ‌నిధికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో నాదర్‌గుల్ సహకార బ్యాంక్ చైర్మన్, నర్సింహా రెడ్డి, సోషల్ మీడియా ఇంచార్జ్ పన్నాల కృష్ణారెడ్డి, నాయకులు శ్రీరాములు ముదిరాజ్, కోటగిరి జంగయ్య, విజయ్, సందీప్, నిష్కాంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉయ్యూరు శ్రీనివాస్‌కు ఊరట

Satyam NEWS

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థ‌సార‌థి

Satyam NEWS

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సైబరాబాద్ పోలీస్ కుటుంబాలు

Satyam NEWS

Leave a Comment