కొల్లాపూర్ పట్టణంలో పర్యటించిన మాజీ మంత్రి జూపల్లి
కష్టాల్లో ఉన్నవారిని పలుకరిస్తూ….ఆనందంలో ఉన్నవారిని అభినందిస్తూ… నేడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ పట్టణంలో పర్యటించారు. అనారోగ్యంతో మృతిచెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. పట్టణంలోని 16 వ చెందిన జిన్ను కన్నయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే విధంగా 12వ వార్డు కు చెందిన జిలేబి శ్యామలమ్మ వ్యాపార నిమిత్తం మైసమ్మ దగ్గరకు వెళ్లి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆటో పై నుండి కింద పడి తీవ్ర గాయాలు కావడంతో వారం రోజుల పాటు చికిత్స పొంది మృతి చెందింది.
ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న జూపల్లి ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా 9వ వార్డు కు సంబంధించిన మారుగుత్తి హనీఫ్ గత వారం రోజుల క్రితం ఆస్తమా వ్యాధితో బాధపడుతూ మృతిచెందారు.
అదే రకంగా ఇదే వార్డు కు చెందిన హసన్ ఘోరీ వారం రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో వార్డు కౌన్సిలర్ ద్వారా విషయం తెలుసుకున్న జూపల్లి వారి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను మృతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేశారు. ఈ మధ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరిగిన కుటుంబాలను జూపల్లి కలిశారు. చౌని వీధికి చెందిన రిటైర్డ్ ఆర్మీ నజీర్ బాబా అన్న కుమారుడు, అక్క కూతురు వివాహం జరగడంతో వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వారితో పాటు పట్టణానికి చెందిన వివిధ వార్డుల కౌన్సిలర్ లు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.