కడపజిల్లా వీరపల్లె మండలంలో బుధవారం దళితవాడలో, కొత్తపేట లో దుప్పటి, చీరలతో పాటు ఓలిగను రాజంపేట టీడీపీ ఇంచార్జీ ,మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర టీడీపీ సెల్ కన్వీనర్ భత్యాల చెంగల రాయుడు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పేదలకు ఈ వర్షాకాలంలో నీరు ఇంటిలో చేరి ఇబ్బందులు పడుతున్నారని అటువంటి వారిని ఆదుకునే నిమిత్తం ఈ వితరణ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి భారతాల శ్రీధర్ బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.