37.2 C
Hyderabad
May 1, 2024 14: 45 PM
Slider ముఖ్యంశాలు

ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్న వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్యే కోలగట్ల

#mlakolagatla

ధర్మాచరణకు, ధర్మ నిరతికి నిదర్శనం శ్రీరామచంద్రుడు అని, అతని మాట, బాట ప్రతి ఒక్కరికి అనుసరణీయమని ఏపీలో ని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్  కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రాష్ట్రంలో ని కడప  జిల్లా ఒంటిమిట్టలో  వేంచేసియున్న శ్రీ కోదండరామ సీత, లక్ష్మణ స్వామి వారి ఆలయాన్ని ఎమ్మెల్యే కోలగట్ల దర్శించారు.

సకల సుగుణాభి  రాముడు  శ్రీరామునికి ఎమ్మెల్యే కోలగట్ల  ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమి ఉత్సవాల ప్రారంభంలో భాగంగా తొలి రోజు ఎమ్మెల్యే కోలగట్ల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ ఏకశిలా నగరం గా విరాజిల్లుతున్న  ఒంటిమిట్ట ఆలయం భద్రాచలం తర్వాత అత్యంత విశిష్టమైనదిగా విరాజిల్లుతోంది అని అన్నారు.

కష్టాలు , సుఖాలు ఒకే రీతిగా అనుభవించిన కళ్యాణ కారుణ్యమూర్తి శ్రీ రామచంద్రుడు అని అన్నారు. శ్రీరామచంద్రుని దర్శించుకున్న వారిలో విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎం కె బి, ఎమ్మెల్యే కోలగట్ల వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు.

Related posts

ఉపాధి హామీ పనులను పరిశీలించిన అధికారులు

Satyam NEWS

ప్రొఫెసర్ జయ శంకర్ సార్ ఆశయ సాధన దిశగా పాలన

Satyam NEWS

ముంపు ప్రాంతాలకు పునరావాస కేంద్రాలు

Satyam NEWS

Leave a Comment