తెలంగాణ ఫైర్బ్రాండ్, మాజీ ఎంపీ విజయశాంతి (రాములమ్మ) బీజేపీ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు చేసిన సర్జికల్ స్ట్రైక్ మాటలపై ట్వీట్టర్లో స్పందించారు.
సర్జికల్ స్ట్రైక్ అంటే టీఆర్ఎస్, ఎంఐఎంకు అంత భయమెందుకని మండిపడ్డారు.
రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆర్ఎస్, ఎంఐఎంకు భయమెందుకని సూటిగా ప్రశ్నించారు. దానికి బదులు టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా హైదరాబాద్లో ఇంటింటి సర్వే చేసిందని చెప్పొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. పాతబస్తీలో అలాంటి వారు లేరని కేంద్రానికి నివేదిక ఇవ్వొచ్చు కదా అని ఆమె ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.