అడిగిందే తడవుగా అభాగ్యులను ఆదుకుంటున్నారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. తాజాగా హుజురాబాద్, మామిడల పల్లి గ్రామం ,వీణవంక మండలంకు చెందిన సిరిపురం రమేష్ కుమారుడు ప్రశాంత్ గతంలో ఆక్సిడెంట్ కు గురవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.
చికిత్స తర్వాత కోలుకుంటున్న ప్రశాంత్ గుండె సమస్యను గుర్తించడంతో చికిత్స నిమిత్తం నిమ్స్ కు తరలించారు. శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తెలియజేసారు. అందుకు పెద్ద మెత్తంలో డబ్బులు అవసరం కావడంతో మంత్రి గంగుల కమలాకర్ ను కలిసి తన గోడును వెల్లబోసుకున్నాడు తండ్రి రమేష్.
వెంటనే స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయనిధి కింద తక్షణమే 5లక్షల రూపాయల ఎల్వోసి మంజూరు చేయించడమే కాక, ఈరోజు ఆ పత్రాన్ని తన నివాసంలో రమేష్ కు అందజేశాడు. ఇంకా ఏ సహాయం కావాలన్నా నేనున్నానంటూ అభయమిచ్చారు.
కొడుకు ప్రాణాలు కాపాడుకోవడం కోసం తల్లడిల్లుతున్న రమేష్ ప్రభుత్వ సహాయానికి చలించిపోయాడు. తప్పకుండా దేవుని ఆశిస్సులతో, ప్రభుత్వ తోడ్పాటుతో తన కొడుకు సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా తిరిగొస్తాడనే నమ్మకంతో సీఏం కేసీఆర్ కి, మంత్రి గంగుల కమలాకర్ కి ధన్యవాదాలు తెలియజేశాడు.