తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అధిష్టానం పునర్ వ్యవస్థీకరించింది.
పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది.
మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడుగా ఉన్న రేవంత్ రెడ్డి నియామకంపై చాలా కాలం పాటు చర్చలు జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోలేదు.
ఎట్టకేలకు రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.