హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ లో ఒక వివాహిత అనునాస్పదపరిస్థితుల్లో మరణించింది.
రాజునగర్ లో నివశించే సంధ్యారాణి అనే ఈ వివాహిత మహిళ నేడు మరణించడం ఆ ప్రాంతంలో కలకల రేపింది.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంధ్యారాణిది హత్యా లేక ఆత్మహత్యా,అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.