మందకృష్ణ మాదిగ అదేశాల మేరకు బీజేపీ నేతలకు వినతిపత్రం
ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేపట్టాలని కోరుతూ త్రిపుర ఓబీసీ మంత్రి శ్రీరామ్, ప్రశాంత్ పాల్ కి, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావుని, కలిసి ఎమ్ ఆర్ పి ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణను బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చాక 100రోజుల్లో చేస్తామని ఇప్పటి వరకు చెయ్యలేదని, తక్షణమే కేంద్రానికి తమ లేఖను తెలియ్యాలని కోరారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎడవేల్లి యాదయ్య మాదిగ, కొయ్యడ రమేష్ కుమార్, ఏడెల్లి అజయ్, గజ్జల రాజశేఖర్, బుంజూరు విజయ్, ఎంఎస్ఎఫ్ జాతీయ అద్యేక్షుడు షోమశేఖర్. రామరపు శ్రీనివాస్.సంతోష్, ఎంఎఫ్ఎస్ మహిళ నాయకురాళ్లు, అంబర్ పేట నియోజికవర్గ ఇంచార్జి బడుగుల బాలకృష్ణ మాదిగ
సత్యం న్యూస్, అంబర్పేట