ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలని మండల విద్యాశాఖాధికారి బి.సైదా నాయక్ అన్నారు. సూర్యాపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన బూర వెంకటేశ్వర్లు అభినందన సభలో పాల్గొన్నారు.
సన్మానించిన అనంతరం సైదా నాయక్ మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గ శ్రీనివాసపురం UPS ప్రధానోపాధ్యాయుడు బూర వెంకటేశ్వర్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నిక కావడం మనందరికీ గర్వకారణం అన్నారు.
విద్యార్ధుల భావి జీవిత దిశా నిర్ధేశకులని, ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో STU రాష్ట్ర నాయకులు వి.యతిపతిరావు,మండల ప్రధాన కార్యదర్శి కె.శివయ్య,రామూర్తి,
కర్నె వెంకటేశ్వరరావు, విజయకుమార్, శ్రీరామ్, గోవిందు నాయక్,PRTU మండల అధ్యక్షుడు వేముల శ్రీనివాస్, దేవుడు,UTF అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, శ్రీహర్ష, సుస్మితా సిరి,సి ఆర్ పి సైదులు, మెసెంజర్ జయరాజు, బుడిగ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.