రాష్ట్రంలో కుటుంబ పాలన, పెత్తనం లేకుండా చేయాలంటే రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆంక్షకు ఈ మునుగోడు ఎన్నికలు కీలకం అన్నారు. కేసీఆర్ కుటుంబానికి కర్రు కాల్చి వాత పెట్టాలని, రాష్ట్రంలో కుటుంబం పెత్తనం లేకుండా చేయాలంటే రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కోరారు
. అనేక మంది తమ ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణాను , కేసీఆర్ కుటుంబం మోసం చేస్తున్నదన్నారు. దోచుకున్న డబ్బుతో విమానం కొనే వరకు కేసిఆర్ వెళ్లారని, ఇసుక , భూమి , లిక్కర్ వంటి స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మొత్తం దోచుకొని ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి దోచునేందుకు ప్లాన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ మొత్తం కేసీఆర్ కుటుంబానికి బానిసగా ఉండాలన్న కోరిక వారికి వుందని, నిజాం , రజాకార్ల పాలనను తలపిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ తల్లి కేసీఆర్ కుటుంబం లో బందీగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను తమ పథకాలుగా మారుస్తోందని, దేశంలో ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్ ఆని, కల్వకుంట్ల కుటుంబం బందీ నుంచి తెలంగాణ ను విముక్తి చేస్తాం అని పేర్కొన్నారు.