సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ తో భీమ్ ఆద్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ‘రావణ్’ భేటీ కావడంతో ఒక్క సారిగా ఉత్తర ప్రదేశ్లో రాజకీయ హై డ్రామా కొనసాగింది. అయితే యాదవ్ను కలిసిన తర్వాత ‘రావణ్’ చెప్పిన మాటలు ఒక్క సారిగా సంచలనం సృష్టించారు.
ఆయన మాట్లాడుతూ, బిజెపిని ఓడించడానికి తన పార్టీ భీమ్ ఆర్మీ ఎస్పిలో చేరాలనుకుంటున్నట్లు చెప్పారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఇష్టం లేకనే తాము సమాజ్ వాదిలో చేరాలని అనుకున్నామని ఆయన తెలిపారు. అయితే, అఖిలేష్ యాదవ్కు దళితులు అక్కర్లేదని, దళితులు తనతో ఉండకూడదని ఆయన అనుకుంటున్నారని రావణ్ తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లో దళితులు సొంతంగా పోరాడతారని అన్నారు.