శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ధార్మిక, భక్తిప్రచార కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26 లక్షలా 98 వేలా 70 రూపాయలు స్పాన్సర్షిప్ అందించింది.
బ్యాంకు ఎండి చల్లా శ్రీనివాసులు చెట్టి ఈ స్పాన్సర్షిప్ మొత్తం డిడిని ఆదివారం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టిటిడి అదనపు ఈవో మరియు ఎస్వీబీసీ ఎండి ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్బిఐ అమరావతి సర్కిల్ సిజిఎం సంజయ్ సహాయ్, జనరల్ మేనేజర్ వినిత భట్టాచార్జీ, తిరుపతి డిజిఎం ఎస్.గిరిధర్, రీజనల్ మేనేజర్ ఎస్.సత్యనారాయణ, తిరుమల శాఖ మేనేజర్ సిహెచ్విఎస్.ప్రసాదరావు పాల్గొన్నారు.