రైతు సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. కల్వకుర్తి మండల పరిధిలోని తాండ్ర గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.
వరి ధాన్యం ఏ గ్రేడ్ కు రూ.1835, బి గ్రేడ్ కు రూ. 1815 క్వింటాలుకు చెల్లిస్తుందని పేర్కొన్నారు. రైతు సోదరులు మధ్య దళారీలను ఆశ్రయించకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి లబ్దిపొందాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీత కురుమయ్య, మార్కెట్ చైర్మన్ బాలయ్య , వైస్ చైర్మన్ విజయ్ గౌడ్, గ్రామ సర్పంచ్ సుశీల ఈశ్వరయ్య, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కాయితి ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీవో బాలచంద్ర సుజన్, ఎడిఎ వెంకటేశ్వర్లు, ఏవో శ్రీలత, మహిళా సంఘం నాయకురాలు రేష్మ బేగం, చూసి రాజేశ్వరి , అఫ్రా బీన్, శోభారాణి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
కల్వకుర్తి పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ కు రూ లక్ష అందజేశారు. Corona నిర్మూలనకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేష్ కుమార్, తాసిల్దార్ రామ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్యం, సీఐ ఆవుల సైదులు, కమిషనర్ జాకీర్ అహ్మద్, పలువురు నాయకులు తదితరులు ఉన్నారు.