కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు చేయాల్సిందే. మరి లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలి కదా? ప్రజలు సహకరిస్తేనే కదా లాక్ డౌన్ సక్సెస్ అయ్యేది?
లాక్ డౌన్ సక్సెస్ అయితే కదా కరోనా తగ్గేది అందరూ సుఖంగా ఉండేది.
పోలీసులు లాక్ డౌన్ అమలు చేస్తుంటే సహకరించకుండా దొంగదారులు వెతుకుతున్న వారు ఎందరో. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల పూర్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఈ సంఘటన చూడండి…
(వీడియో)
యువకులు ఎంత మూర్ఖంగా ప్రవర్తించారో… పాపం ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తున్న వారిని నిలుపుదల చేసేందుకు అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసు ఎంతో ప్రయత్నించాడు. అయినా అతను ఆగలేదు.
దాంతో ఆఖరు నిమిషంలో చెక్ పోస్టు గేటు ఎత్తేసేందుకు పోలీసు ప్రయత్నించాడు. అయినా ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి ఆగలేదు.
వేగంగా పోనిస్తూనే ఉన్నాడు. చెక్ పోస్టు గేటు తగిలి ఒక యువకుడు అక్కడికక్కడే మరణించాడు.
వేగంగా బండి నడిపిన వ్యక్తి వెనుకనున్న యువకుడు కిందపడిపోయిన విషయాన్ని కూడా గమనించినట్లు లేడు…. పోలీసులకు దొరక్కుండా పారిపోవడం అనే ఒకే ఒక ఆదుర్దా ఒక ప్రాణం తీసింది….