మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగాని నాగన్న గౌడ్ ను సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ యూజర్ కన్సల్టెంట్ మెంబర్ గా నియమించిన సందర్భంగా గౌడ కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని గౌడ కుల దైవమైన శ్రీ కంఠ మహేశ్వర స్వామి వారి ఆలయంలో కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు వల్లపు దాసు కృష్ణ గౌడ్ అధ్యక్షతన పట్టణ గౌడ సంఘం, గౌడ్ కళ్యాణ మండప నిర్మాణ కమిటీ, గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో ముందుగా శ్రీ కంఠమహేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపించారు.
అనంతరం నాగన్న గౌడ్ ను గజమాలతో అలంకరించి,శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా పెద్ది గౌడ్,బెల్లంకొండ చిరంజీవి గౌడ్,మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,యువజన సంఘం అధ్యక్షుడు బెల్లంకొండ అమర్ గౌడ్,కౌన్సిలర్ యరగాని గురవయ్య గౌడ్ తదితరులు మాట్లాడుతూ సాధారణ గౌడ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ గౌడ కుల అభివృద్ధికి తోడ్పడుతూ నేడు సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ యూజర్స్ కన్సల్టెంట్ మెంబర్ గా నియమితులైన నాగన్న గౌడ్ మున్ముందు అత్యున్నత పదవులను చేపట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎలక వెంకటేశ్వర్లు గౌడ్,పండ్ల హుస్సేన్ గౌడ్,తండు సాయిరాం గౌడ్, ఉపేందర్ గౌడ్, రామ్మూర్తి గౌడ్, పులి గోవింద్ గౌడ్, రాజా రమేష్ గౌడ్, తండు వెంకన్న, గురవయ్య, బత్తిని మల్లయ్య, సోమగాని వీరన్న, వల్లపుదాసు వెంకటేశ్వర్లు,బాలెబోయిన సత్యనారాయణ,పాండు గౌడ్,నర్సింగ్ సతీష్, కుక్కడపు రామకృష్ణ గౌడ్, హరికృష్ణ గౌడ్,పాపులు,సైదులు,బత్తిని శ్రీనివాస్ గౌడ్,శ్రీనివాస్,వెంకటేష్ గౌడ్, వల్లపుదాసు నాగరాజు, వేముల నరేష్ గౌడ్, యరగాని యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్