నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దుకాణాలపై భైంసా డిఎస్పీ, అగ్రికల్చర్ ఏ ఈ ఓ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయానికి సంబంధించిన పెస్టిసైడ్స్ అదేవిధంగా నకిలీ విత్తనాలను అమ్మకూడదని, రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చి మోసం చేయకూడదని వారన్నారు.
నకిలీ విత్తనాలు ఉన్నా పెస్టిసైడ్స్ నకిలీ మందులు ఉన్నా రైతులకు విక్రయించినా పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామని బైంసా డిఎస్పి, ముధోల్ సిఐ బాసర ఎస్సై అగ్రికల్చర్ ఎ ఇ ఓ తెలిపారు.