నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పాన్ గల్ మండల కేంద్రానికి చెందిన ఆది చిన్న కిష్టయ్య ఐదు రోజుల క్రితం అనారోగ్య కారణాల వలన మరణించారు. ఆది చిన్న కిష్టయ్య దశదిన కార్యక్రమంలో భాగంగా కిష్టయ్య కుటుంబానికి పాన్ గల్ మండల కాంగ్రెస్ నాయకుల చేతుల మీదగా ఆర్థిక సహాయం
అందించిన టీపీసీసీ సభ్యులు చింతలపల్లి జగదీశ్వర్ రావు వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాన్ గల్ మాజీ సర్పంచ్ లు ఆది చంద్రయ్య, కుమ్మరి బాలస్వామి, శాఖాపూర్ గ్రామ సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.