సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డులో చైతన్య కాలని,ఎన్జీవోస్ కాలనిలో నాలుగు లక్షల రూపాయలతో మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి మూడో వార్డు ప్రజలతో కలిసి శుక్రవారం డ్రైనేజీ ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 23వ,వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తంకుమార్ రెడ్డి సహాయ సహకారాలతో అన్ని రకాల నిధులతో మూడవ వార్డుని అభివృద్ధి పథంలో ఉంచడం జరుగుతుందని అన్నారు.త్వరలో మరిన్ని వార్డు ప్రారంభోత్సవ కార్యక్రమాలకి పార్లమెంట్ సభ్యుడు ఉత్తంకుమార్ రెడ్డి ని ఆహ్వానించడం జరిగిందని సంపత్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మీరావలి, శ్రీనివాసరాజు,సత్యనారాయణ రెడ్డి,గంజి శివ,నాగేశ్వరరావు,మల్లికార్జున్,బెల్లంకొండ నాగేశ్వరరావు,సాయి,సైదా,గడ్డం అంజి, వార్డు ప్రజలు,మహిళలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్