29.7 C
Hyderabad
April 29, 2024 08: 06 AM
Slider మెదక్

ముదిరాజులకు ప్రభుత్వం ఆర్థిక బంధు ప్రకటించాలి

#mudiraj

ముదిరాజు కులస్తులకు తక్షణమే ఆర్థిక బంధు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్య్సకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి ముదిరాజ్ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో జంగిటి మాట్లాడుతూ అనేక పథకాలను ప్రవేశపెడుతున్న కేసీఆర్ ముదిరాజులకు ఒక్క పథకమైన ఇవ్వరా అని ప్రశ్నించారు.

రాష్ట్ర కార్యదర్శి కొమురవెళ్లి నర్సింహులు మాట్లాడుతూ ముదిరాజ్ లందరూ ఏక తాటిపైకి వచ్చి పోరాటం చేసినప్పుడే ఆర్థికంగా బలపడగలమని అన్నారు. ముదిరాజులు పోరాటంలో వెనుకబడుతున్నారని అన్నారు.

జిల్లా అధ్యక్షులు పడిగె భాస్కర్, ప్రధాన కార్యదర్శి గణపూర్ మల్లేశంలు మాట్లాడుతూ ముదిరాజులు విద్యలో వెనుకబడి ఉన్నారని తద్వారా ఉన్న జీ.ఓ ల గురించి తెలుసుకోలేక పోయామని, తెలియజేయాల్సిన ప్రభుత్వాలు ముదిరాజుల విషయంలో అలసత్వం వహించాయని అన్నారు.

ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, గ్రామ అధ్యక్షునిగా రామచంద్రం లను నియమించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కండ్లకోయ బాల కృష్ణ, మండల అధ్యక్షుడు కొరివి నర్సింహులు, కన్వీనర్ లు బోనాల శ్రీనివాస్, కాస రమేష్, కోరమేన యాదగిరి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

విపత్కర సమయంలో కూడా వికృత రాజకీయం

Satyam NEWS

ఇంకో పరిశ్రమలో గ్యాస్ లీక్ తో భీతిల్లిన కార్మికులు

Satyam NEWS

Leave a Comment