విజయనగరం జిల్లా కేంద్రంలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో అగ్ని మాపక శాఖకు ఫోన్ అందడంతో హుటాహుటిన రావడం… వెనువెంటనే రంగంలో కి దిగడంతో అరగంట వ్యవధిలో మంటలను ఆర్పేసారు.నగరంలో ని గూడ్స్ షెడ్ వద్ద ఉన్న హోల్ సేల్ బట్టల దుకాణం అయిన బాలాజీ టెక్స్ట్ టైల్స్ మార్కెట్ లో సరిగ్గా మధ్యాహ్నం 12 55 కి మార్కెట్ లో ట్రాన్స్ ఫార్మ్ పేలడంతో. ఒకసారి విద్యుత్ ఆగి…రెండు హైపవర్ వైర్లు తాకడంతో మార్కెట్ లో శాంతి బట్టల షాప్ లో ఒక్క సారి షాట్ సర్క్యూట్ అయి..మంటలు అంటుకున్నాయి.ఊహించని ఘటనతో షాప్ లో ఉన్న వాళ్ళు ఒక్క సారి బయటకు పరుగులు తీసారు..
అప్పటికే ఫైర్ ఇంజన్ రావడంతో మంటలు ఆపుజేసారు.అయితే ఫైర్ సిబ్బంది లో ఇద్దరు ప్రసాద్ ,వెంకట్ లు తెగించి, ధైర్యం చేసి దట్టమైన పొగలు, ఊపిరి ఆడని వేడి గాలులో షోరూం కు వెళ్లి మరీ మంటలను అదుపు లోకి తీసుకువచ్చారు. అయితే షో రూం బిల్డింగ్… మంటల ధాటికి పగుళ్లు వచ్చి.. గోడల నుంచీ పోగలు ,మంటలు వ్యాపించాయి. కాగా.. అనుకోని ఘటనలో మనుషుల ప్రాణాలకు ఏమీ జరగలేదు కానీ… సుమారు రెండు కోట్ల ఆస్థి నష్టం సంభవించి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.