అధికార పార్టీ… ఆ పై విజయనగరం జిల్లా అధ్యక్షుడు దన్ను మెండుగా ఉంది. సీఎం జగన్ సభ వేదిక పైకి… సార్ తో పాటు ఎప్పటిలానే వెళ్లొచ్చని అనుకున్నారు.. ఆ పెద్దాయన. తీరా మరికాసేపట్లో సీఎం జగన్ సారం…భోగాపురం రావివలస వద్ద ఏర్పాటు చేసిన సభావేదికపై వస్తున్నారనగానే…ఆ పెద్దాయన స్టేజ్ ఎక్కేందుకు సంసిద్ధుడయ్యారు.ఆ సమయంలో పటిష్టమైన భద్రత వలయంలో ఓ వైఎస్ జాగిలాలతో సభాస్థలి ని పరిశీలిస్తున్న డాగ్ స్వ్కాడ్ మరోవైపు.. సీఎం సార్ వస్తున్నారనగానే..హై సెక్యూరిటీ పోలీసులు చెకింగ్ లు.అదీ తాడిపూడి నుంచీ సీఎం సెక్యూరిటీ విభాగం.. దాదాపు 20 మందికి పైగా సభా స్థలికి తమ ఆధీనంలోకి తీసుకు న్నారు.సరిగ్గా అప్పుడే పలాస కు చెందిన వైఎస్సార్సీపీ నేత పులిరాజు… సభా వేదికపైకి ఎక్కేందుకు వెళ్లారు. ఎప్పుడూ జేడ్పీ చైర్మన్, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చిన్న శీను వెంటే ఉండే పులిరాజు… ఈ సమయంలో కూడా నన్నెవరూ ఆపరులే అనో అనుకుని స్టేజ్ ఎక్కాడు.. ఆ వెంటనే సీఎం సెక్యూరిటీ వింగ్…ఆయనను దిగిపోమని చెప్పింది. తాను.. ఫలానా అని సదరు నేత చెప్పి నప్పటికీ… స్టేజీ మీదకు వచ్చే వారి పేర్ల జాబితా లో మీ పేరు లేదని… తక్షణమే దిగిపోవాలని చెప్పడంతో గత్యంతరం లేక స్టేజ్ దిగిపోయారు.