ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని యువ హీరో నాగశౌర్య తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం బ్రహ్మాండంగా కొనసాగుతుందని, ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు ధన్యవాదాలని ఆయన అన్నారు.
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఫిల్మ్ నగర్ షేక్ పెట్ లోని తన నివాసంలో నాగశౌర్య మొక్కలు నాటాడు.
అనంతరం మరో ముగ్గురు ( ప్రముఖ నటుడు జగపతి బాబు , హీరో నారా రోహిత్ , డైరెక్టర్ నందిని రెడ్డి ) లు కూడా మూడు మొక్కలు నాటి వారు మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసరాలని యువ హీరో నాగశౌర్య పిలుపునిచ్చాడు.