లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కడప జిల్లా ఒంటిమిట్ట మండల మాజీ జెడ్పిటిసి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కూరగాయలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ముఖ్యఅతిథిగా రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట మాజీ శాసనసభ్యులు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు.
కూరగాయలు సరుకులు పంచిపెట్టిన ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి కట్టడికి అందరూ సహకరించాలని కోరారు. ఇబ్బందులు పడుతున్న పేదల కోసం నిత్యావసర వస్తువులు ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.