సమాచార హక్కు చట్టం ప్రచార సమితి ములుగు నియోజకవర్గ పొలిటికల్ కన్వీనర్ గా చపర్తి రాజు ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు ఏర్పుల శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కమిటీకి ఎల్లవేళలా పనిచేస్తానని తనపై నమ్మకంతో ఈ నియామకాన్ని అందించిన రాష్ట్ర అధ్యక్షులు ఎర్పుల శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి రెడ్డి శ్యామ్, జిల్లా ఉపాధ్యక్షులు పొరిక రాహుల్ నాయక్,మండల ఉపాధ్యక్షులు దిగ్యపోగు మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.