రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కరోనా బాధితుల కోసం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఓ భారీ ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. గచ్చిబౌలిలో స్పోర్ట్స్ అథారిటీకి సబంధించిన కాంప్లెక్స్ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చేందుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తదితరులు ఆసుపత్రి పనులను పరిశీలించారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ ఈనెల 15లోగా ఆసుపత్రిని సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశించారు.
previous post