28.7 C
Hyderabad
April 28, 2024 10: 05 AM
Slider జాతీయం

సిలిండర్‌ పేలి ఐదుగురు పిల్లలు దుర్మరణం

బీహార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు అమాయక చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.

అయితే, మృతి చెందినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బంకాలోని రాజౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజాభార్ ప్రాంతంలో జరిగింది. బంకా బ్లాక్ ఏరియాలోని రాజావర్ గ్రామంలో ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు.

మృతుల్లో ఓ బాలుడు, నలుగురు బాలికలు ఉన్నారు. వారిలో నలుగురు తోబుట్టువులు కాగా, ఒకరు బంధువు ఉన్నారు. జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

Related posts

పిట్లం మండల కేంద్రంలో ఆసుపత్రికి నూతన భవనం

Satyam NEWS

రానా ద‌గ్గుబాటి లాంచ్ చేసిన ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ టైటిల్ పోస్ట‌ర్‌

Satyam NEWS

ఆ కిరాతకులు లారీ డ్రైవర్ క్లీనర్ మరో ఇద్దరు

Satyam NEWS

Leave a Comment