బీహార్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు అమాయక చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.
అయితే, మృతి చెందినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బంకాలోని రాజౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజాభార్ ప్రాంతంలో జరిగింది. బంకా బ్లాక్ ఏరియాలోని రాజావర్ గ్రామంలో ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు.
మృతుల్లో ఓ బాలుడు, నలుగురు బాలికలు ఉన్నారు. వారిలో నలుగురు తోబుట్టువులు కాగా, ఒకరు బంధువు ఉన్నారు. జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.