జమ్మూ కాశ్మీర్లో గత రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. కశ్మీర్ లోయలోని పుల్వామా, బుద్గామ్ జిల్లాల్లో శనివారం రాత్రి కాల్పులు జరిగాయి. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామాలోని నైరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా, సెంట్రల్ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలోని చ్రార్-ఇ-షరీఫ్ ప్రాంతంలో ఒక ఉగ్రవాది హతమైనట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పుల్వామా కాల్పుల్లో హతమైన నలుగురు ఉగ్రవాదులు జేఈఎంకు చెందినవారని తెలిపారు. చ్రార్-ఇ-షరీఫ్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో, LeT సంస్థతో అనుబంధంగా ఉన్న ఒక ఉగ్రవాది హతమైనట్లు ఆయన చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. ఎన్కౌంటర్ స్థలం నుండి AK 56 రైఫిల్తో సహా ఇతర మారణాయుధాలు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. జేఈఎం కమాండర్ జాహిద్ వనీ సహా ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చడం భద్రతా దళాలకు పెద్ద విజయమని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ అన్నారు.
previous post