దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పొగమంచు జనజీవానికి విఘాతంగా మారింది.ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో 18 విమాన సర్వీసులను రద్దు చేశారు.జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారీవర్షాలతోపాటు మంచు కురుస్తుండటంతో ఢిల్లీలో ఉష్ణోగ్రత 3.5 డిగ్రీలకు తగ్గింది.
పొగమంచు ప్రభావంతోపాటు వాతావరణం అనుకూలించక పోవడంతో 18 విమాన సర్వీసులను రద్దు చేశామని ఢిల్లీ విమానాశ్రయ సీనియర్ అధికారి చెప్పారు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారీవర్షాలతోపాటు మంచు కురుస్తుండటంతో శ్రీనగర్ విమానాశ్రయానికి విమానాల రాకపోకలను రద్దు చేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో రన్ వేను మంచు కప్పేసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మంచు కురవడంతో సిమ్లా, కుల్లూ జిల్లాల్లో పలు రోడ్లను మూసివేశారు