ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధి పిలుపు మేరకు మాజీ శాసన సభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి లక్ష రూపాయల విరాళాన్ని అందచేశారు. ఈ మేరకు చెక్కును టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని వారు నేడు అందచేశారు.
కరోనా సమయంలో పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ తమకు తోచిన రీతిలో సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. లక్ష రూపాయల విరాళం అందజేసిన మాజీ శాసన సభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి లను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు.