వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ఆదేశించారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం రోజున వినాయక నిమజ్జనం జరగబోతున్నది.
నిమజ్జనానికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాల్సినదిగా కలెక్టర్ సూచించారు. జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి సంబంధిత గణేష్ మండళ్ల అసోసియేషన్ మెంబెర్స్, ప్రజలు సహకరించాలని కోరారు.