దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాజంపేట మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులు వెలిగించారు. కడప జిల్లా రాజంపేట పట్టణం ఆకేపాటి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా నుండి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన జిల్లా కాపాడాల్సిన బాధ్యత మన మనదరిపైన ఉంది అని ఆయన అన్నారు.
కరోనా వ్యాధి అంటించుకునే వ్యాధిని అని చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట రోటరీ క్లబ్ ఆఫ్ అన్నమయ్య సెక్రెటరీ, ప్రభుత్వ న్యాయవాది గురు ప్రతాప్ రెడ్డి, పి ఆర్ ఓ మహేశ్వర్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ దండు గోపి, ఊటుకూరు ఎంపిటిసి శ్రీనివాసరాజు, పోలి మురళి మోహన్ రెడ్డి, జహీద్ అలీ, జీవి సుబ్బరాజు, అమర్, కమలాకర్, శీను తదితరులు పాల్గొన్నారు.