బిచ్కుంద మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు నిరాశ్రయులకు నిరుపేదలకు యాచకులకు ప్రతి రోజు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గురువారం బిచ్కుంద ఉపసర్పంచ్ నాగరాజు తన వంతు సహకారంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
గ్రామపంచాయతీ ప్రాంగణంలో ఎంపిపి అశోక్ పటేల్ తహసీల్దార్ వెంకట్రావు చేతుల మీదుగా పారిశుద్ధ కార్మికులకు భోజనాన్ని అందించారు .మిగిలిన వారికీ బిచ్కుందకు చెందిన స్వచ్ఛంద సంస్థ సభ్యులచే భోజనాన్ని అందించే ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎంపీపీలతో పాటు పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ, డాక్టర్ రాజు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, ఖడ్గం హనుమాన్లు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.