ఆంధ్రుల అభిమాన నటుడు, ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు నందమూరి తారకరామారావు 97 వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి బాలయ్య బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆదరణ, మొల్లమాంబ వృద్ధాశ్రమాలలో జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధులకు ఆహారాన్ని అందచేశారు.
ఈ అన్నదాన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాకుమాను సైదయ్య, దంత వైద్య నిపుణులు డాక్టర్ వడేంపూడి పవన్ కుమార్, తెలుగుయువత నాయకులు బండారుపల్లి ఆంజనేయులు చౌదరి శ్రీను,కొండవీటి జయప్రకాష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.