రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6న భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 21వ వార్షిక సమావేశం కూడా జరగనుంది. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక చర్చలను కూడా ప్రకటించారు.
వీరి భేటీలో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. హిందూ మహాసముద్రం, ఆఫ్ఘనిస్థాన్, సిరియా వంటి ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO), రష్యా-భారత్-చైనా (RIC) గురించి కూడా ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. చాలా విషయాల్లో భారతదేశం, రష్యా మధ్య ఒప్పందం-సహకారం ఉంది. మోదీ, పుతిన్ల మధ్య జరిగే చర్చల్లో రక్షణ, వాణిజ్యంపై కూడా ముఖ్యమైన ఒప్పందాలు కుదరవచ్చు.