అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ సహకారంతో జలం – శ్రేయస్సు కోసం అడవులు అనే ధ్యేయంతో ఫారెస్ట్ ప్లస్ 2.0. కార్యక్రమాన్ని మెదక్ అటవీ డివిజన్ పరిధిలో అమలు చేయనున్నారు. యూఎస్ ఎయిడ్ – కేంద్ర అటవీ పర్యావరణ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో ఫారెస్ట్ ప్లస్ 2.0 అమలు కానుంది. అటవీ పునరుజ్జీవనం, అడవుల్లో నీటి వనరుల అభివృద్ధికి USAID సహకరించనున్నది. సోమాజిగూడ ది పార్క్ హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూఎస్ ఎయిడ్ ప్రతినిధుల వర్ఘిస్ పాల్, రమొనో, కేంద్ర అటవీ శాఖ ఐజి నోయాల్ థామస్, pccf అర్. శోభ, అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ ఎండీ రఘువీర్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
previous post