కడప జిల్లా నందలూరు లోని ప్రసిద్ద శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో సోమవారం రోజు రాత్రి సౌమ్యనాధ స్వామి సింహ వాహనం మత్సావతార శ్రీ సౌమ్యూని గా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
నలు వైపులా భక్తులు చేతులెత్తి మొక్కుతుండగా గోవింద నామ ఘోషల నడుమ శ్రీ సౌమ్యనాధ స్వామి పుర వీధుల్లో రంజిల్లుతూ విహరించారు. సకల జనుల అజ్ఞానాన్ని తొలగిస్తూ జ్ఞాన కాంతులను ప్రసరింపచేస్తూ జ్ఞానస్వరూపుడై సాక్షాత్క రించారు.
మంగళ వ్యాయిద్యాలు భక్తుల నీరాజనాల మధ్య వాహన సేవ వైభవంగా సాగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా నందలూరు కు భారీగా భక్తులు తరలివచ్చారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.