24.7 C
Hyderabad
March 26, 2025 10: 34 AM
Slider జాతీయం

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌: నలుగురు మావోయిస్టుల మృతి

#maoist

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. డీఆర్‌జీ పెట్రోలింగ్‌ బృందం చిన్న తుంగలీ అడవీ ప్రాంతంలో గాలిస్తుండగా మావోయిస్టులు తారస పడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కాల్పులు చోటు చేసుకున్నాయని, ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమైనట్లు వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలతో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.

Related posts

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి తాగించండి

Satyam NEWS

అమెరికాలోని పలు నగరాల్లో భారతీయుల ర్యాలీలు

Satyam NEWS

బిచ్కుందలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment