బయో గ్యాస్ ప్లాంట్లను నిర్మించుకోవడం ద్వారా గ్రామాలలోని రైతులు మరింత అభివృద్ధి చెందవచ్చునని దహెగాం ఎస్ ఐ రఘుపతి అన్నారు. నేడు దహెగాం మండలంలోని చంద్ర పల్లి గ్రామంలో ఎస్ కే జీ సంఘ స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిర్మించిన బయోగ్యాస్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ కే జీ సంఘ సేవ సంస్థ ఉచితంగా ఈ గ్యాస్ ప్లాంట్లను నిర్మించి ఇస్తుందని తెలిపారు. రైతులందరూ వీటిని నిర్మించుకోవాలని ఆయన కోరారు. ఈ ప్లాంట్ నిర్మించుకోవడం వలన ఉచిత వంట గ్యాస్ వస్తుందని అదే విధంగా సేంద్రియ ఎరువు తయారవుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిపి సులోచన సంతోష్ గౌడ్ ఎస్ కే జి సంఘ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డి విద్యాసాగర్ రావు మాజీ సర్పంచ్ బాలకిషన్ పాల్గొన్నారు.