38.2 C
Hyderabad
April 27, 2024 18: 59 PM
Slider ఆదిలాబాద్

రైతులకు ఉచితంగా బయో గ్యాస్ ప్లాంట్ల నిర్మాణం

#Bio Gas Plant

బయో గ్యాస్ ప్లాంట్లను నిర్మించుకోవడం ద్వారా గ్రామాలలోని రైతులు మరింత అభివృద్ధి చెందవచ్చునని దహెగాం ఎస్ ఐ రఘుపతి అన్నారు. నేడు దహెగాం మండలంలోని చంద్ర పల్లి గ్రామంలో ఎస్ కే జీ సంఘ స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిర్మించిన బయోగ్యాస్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ కే జీ సంఘ సేవ సంస్థ ఉచితంగా ఈ గ్యాస్ ప్లాంట్లను నిర్మించి ఇస్తుందని తెలిపారు. రైతులందరూ వీటిని నిర్మించుకోవాలని ఆయన  కోరారు. ఈ ప్లాంట్ నిర్మించుకోవడం వలన ఉచిత వంట గ్యాస్ వస్తుందని అదే విధంగా సేంద్రియ ఎరువు తయారవుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిపి సులోచన సంతోష్ గౌడ్ ఎస్ కే జి సంఘ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డి విద్యాసాగర్ రావు మాజీ సర్పంచ్ బాలకిషన్ పాల్గొన్నారు.

Related posts

చిన్నపిల్లల అక్రమ రవాణాలో తొలి మూడు స్థానాల్లో ఏపీ

Bhavani

కోవిడ్ బాధితులకు ఆహారం పంచిన విహెచ్ పి

Satyam NEWS

ముగిసిన యోగ‌వాశిష్ట శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్ర పారాయ‌ణం

Satyam NEWS

Leave a Comment