సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా టీచర్స్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆయన సతీమణి రజిత రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పదని,తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి గొప్పగా వివరిస్తూ,పరాయి పాలనలో మరచిపోయిన తెలంగాణ సాంప్రదాయాలను మరల కెసిఆర్ తన పాలనలో పూర్వపు సాంప్రదాయాలు, వైభవాన్ని తీసుకువచ్చారని అన్నారు.దుర్గ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు అందరూ క్షేమంగా,సంతోషాలతో ఉండాలని,అన్నారు. మహా అన్నదాతగా ముందుకు వచ్చిన తండు హరికృష్ణగౌడ్, హరికృష్ణ డయాగ్నస్టిక్ సెంటర్ వారు ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని ముందుండి నడిపించినందుకు అభినందనలు తెలిపారు.అనంతరం సైదిరెడ్డిని శాలువాతో సత్కరించి సన్మానించారు.
సుమారు 4000 మంది ప్రజలు పాల్గొన్నా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి,వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,కౌన్సిలర్ యారగని గురవయ్య,జక్కుల శంబయ్య,కొమ్ము శ్రీను,బెల్లంకొండ అమర్ గౌడ్,బెల్లంకొండ శ్రీనివాస్,చక్రాల గోవింద్,టీచర్స్ కాలనీ యూత్ కమిటీ సభ్యులు సిరికొండ సందీప్,బెల్లంకొండ వికాస్,కేశరాజు గోపి,కారంగుల కాశీ విశ్వనాథ్,తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్