నేల కాలుష్యానికి పరిష్కారంగా ఉండాలని తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపుర్ గ్రామంలో సోమవారం ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా రైతు సోదరుల సమావేశంలో నేల వనరుల స్థిరమైన నిర్వహణ కోసం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ మానవాళిలో ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకునే ధరణి మాతాని మనమందరం భూమాతను మరిచిపోయి కంప్యూటర్ యుగం వైపు అడుగులు వేస్తున్నామని రైతులు ప్రతినిత్యం పండించే పంటల కోసం సేంద్రియ ఎరువులను మరిచిపోయి రసాయన ఎరువులు ఎక్కువ మొత్తంలో వినియోగిస్తున్నామని రానున్న తరాల వారికి నేల కాలుష్యంతో సర్వశక్తిమంతుడైన అన్ని జీవులకు అనారోగ్య ముప్పు ఉందని పేర్కొన్నారు.
ప్రపంచ నేల దినోత్సవం డిసెంబర్ 5 న ఆరోగ్యకరమైన నేల యొక్క ప్రాముఖ్యతపై దృష్టి పెట్టడానికి, నేల వనరుల స్థిరమైన నిర్వహణ కోసం వాదించడానికి ఉద్దేశించబడిందని, ఆహార భద్రత, ఆకలి నిర్మూలన, వాతావరణ మార్పుల అనుకూలత, పేదరికం తగ్గింపు స్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలకు మట్టి యొక్క భూమి శరీరం. మొక్కలు పెరిగే భూమి పై పొర నలుపు లేదా ముదురు గోధుమ రంగు పదార్థం సాధారణంగా ఆర్గానిక్స్ మిశ్రమాన్ని కలిగి ఉంటుందని తెలిపారు.
ఇది మట్టి రాతి కణాలుగా మిగిలిపోయిందని దురదృష్టవశాత్తు మన భౌతికవాద జీవనశైలి కారణంగా ప్రపంచం నేల కాలుష్యంతో బాధపడుతోం దన్నారు. మానవ ఆరోగ్యానికి పర్యావరణ వ్యవస్థకు హాని కలిగించేంత అధిక సాంద్రతలలో మట్టిలో విష రసాయనాలు ఉండటం మట్టిలో సహజంగా సంభవించే కలుషితాల విషయంలో మట్టిలో కలుషితాల స్థాయిలు సహజంగా ఉండవలసిన స్థాయిని మించిపోవడం కూడా నేల కాలుష్యంతో మానవులకు సర్వశక్తిమంతుడైన అన్ని జీవులకు ఈ ముప్పు ఉందని తెలిపారు.
పట్టణాల్లో నివసించే వారు కూడా సేంద్రియ ఎరువులతో పండించిన పంటకే మక్కువ చూపిస్తున్నారని తెలిపారు. నేటి నుంచి వ్యవసాయ అధికారులు ఇచ్చే సూచనలను సలహాలను పాటిస్తూ నేల కాలుష్యానికి పరిష్కార దిశగా రైతులు చేదోడువాదోడుగా సహకరించాలని ఆమె సూచించారు.